శాస్త్రీయ దృక్పథం

విజ్ఞానశాస్త్ర అభిమానులకు "విజ్ఞానశాస్త్రము"బ్లాగు స్వాగతం ఈ బ్లాగు ప్రజలలో,విద్యార్థులలో ఉపాధ్యాయులలో శాస్త్రీయదృక్పథాన్ని పెంచుటకు ఉద్దేశించబడినది.

Wednesday 8 August 2012

అంగారకుని పై జీవాన్వేషణ


                 అంతరిక్ష పరిశోధనల్లో  అత్యంత అధునాతనమైన వ్యోమ నౌక /రోవర్ curiocity  సోమవారం       ఉదయం11 గంటలకు అంగారకుని పై దిగింది.NASA లోని జెట్ ప్రొపల్షన్ laboratory లో శాస్త్ర వేత్తలు ఒకరినొకరు హత్తుకొని ఆనందంతో పొంగిపోయారు.గతంలో ఎప్పుడైనా జీవం ఉనికిలో ఉందా!భవిష్యత్తు లో జీవం ఉనికి లో ఉండటానికి అవసరమైన పరిస్థితులు అక్కడున్నాయా!వంటి ప్రశ్నలకు ఇది సమా ధానం కనుగొనబోతుంది.దిగిన కొద్ది సేపటికే చిన్న సైజు ఫోటోను ,మరొక భారీ సైజు ఉన్నమరో  ఫోటోను  పంపించి అక్కడి మట్టిని,రాళ్ళను భూమి పైకి తీసుకు వచ్చి వాటిని పరీక్షించి project లకు  వ్యోమగా ముల్ని అక్కడికి పంపించాలన్నఆలోచనకు మార్గం వేయనుంది.జీవం ఉనికికి అత్యవసరమైన  corbon,nitrogen,phospurus,sulphur,oxygen వంటి మూలకాలను ఇది అన్వేషిస్తుంది.
           ఈ వ్యోమ నౌక plutonium వేడి నుంచి పుట్టే విద్యుత్తు ద్వారా పనిచేస్తుంది.ఇందులో భారత శాస్త్ర వేత్తలు అశ్విన్,అమితాబ్ ఘోష్,అనితాసేన్ గుప్త,రవి ప్రకాష్ పాల్గొన్నారు.ఇందులో అశ్విన్ ఈ యాత్రకు deputy project scientist గా ఎదిగారు.రానున్న రోజుల్లో ఆయన నేతృత్వం లోని శాస్త్రవేత్తల బృందం దాదాపు 400 మంది అంగారకుడిపై లోగడ ఎప్పుడైనా జీవం ఉనికికి అనువైన  పరిస్థితులు ఉన్నాయా,  లేవా అని తేలుస్తుంది.ఇప్పటి వరకు అంగారకుని పైకి మేరైనర్ 4,6,7,9 vyking1,2 mars global surveyor,odissee ,mars express,mars pathfinder,mro,spirit,opportunity,feeniks వంటి అనేక రోబోటిక్ యాత్రలు జరిగాయి.

No comments:

Post a Comment