శాస్త్రీయ దృక్పథం

విజ్ఞానశాస్త్ర అభిమానులకు "విజ్ఞానశాస్త్రము"బ్లాగు స్వాగతం ఈ బ్లాగు ప్రజలలో,విద్యార్థులలో ఉపాధ్యాయులలో శాస్త్రీయదృక్పథాన్ని పెంచుటకు ఉద్దేశించబడినది.

Saturday 13 October 2012

జీవ వైవిధ్య విధ్వంస చిత్రం

  • ప్రపంచంలో క్షీరద జాతులు:5494
  • ఇప్పటికే అంతరించినవి:78
  • అంతర్దానం అంచున:191
  • కనుమరుగయ్యే జాబితాలో:447
  • సంఖ్య తగ్గిపోతున్నవి:496
  • గత 500 ఏళ్లలోమానవుల చర్యల వల్ల 969 జాతులు అంతరించాయి.నేడు క్షీరదాలలో 25% పక్షులలో 13% కోరల్స్ 33%ఉభయచరాలలో 41%, అంతర్థాన ముప్పును ఎదుర్కొంటున్నాయి క్షీరదాలు,పక్షులు ఎక్కువ గా ఇండోనేషియా,భారత్,బ్రెజిల్,చైనా వంటి దేశాలలోముప్పును ఎదుర్కొం టున్నాయి .
  • ప్రస్తుత జీవుల్లోదాదాపు సగం మేర,2100 సం : నాటికి అంతరించి పోవచ్చని అంచనా. వాతావరణ  ప్రతికూల పరిస్థితుల కారణంగానే 2100 నాటికి అన్నిరకాల జీవ జాతులు10-14 శాతం వరకూ తమ  ఉనికి  కోల్పోయే  ప్రమాదముందని  US NATIONAL ACADEMY  OF SCIENCE హెచ్చరించింది.
  • గత 100 ఏళ్లలో వ్యవసాయ పంటల్లోని  జీవ వైవిద్యం మూడొంతులు నాశన మైంది.ఇప్పుడు ప్రపంచం లోని సగానికి పైగా దేశాలకు కేవలం నాలుగు రకాల పంటలే  ఆహారిన్నిస్తున్నాయి.నెల సారవంతంగా  మారడాని కి  పట్టే  సమయం కంటే ఇప్పుడు వేగంగా సారాన్ని కోల్పోతుంది.ప్రపంచ వ్యాప్తంగా13 నుంచి18 రెట్లు  వేగం గా ఇది జరుగుతుంది.
  • భారత్,అమెరికా,ఇంగ్లాండ్,ఆస్ట్రేలియ,soth africa,brazil దేశాలలోపురుగు మందుల వాడకం వల్ల పర్యావర ణానికి వాటిల్లిన నష్టాన్ని ఓ  ఏడాదికి లెక్కిస్తే  అన్నింటాకలిపి వార్షిక నష్టం10,000 కోట్ల  డాలర్సర్స్ 
(ఈ సమాచారం ఈనాడు పత్రిక నుండి సేకరించింది.వారికి ధన్యవాదాలు.)

Tuesday 9 October 2012

చెట్లు మన నేస్తాలు.

   మానవ జాతికి చెట్లు  ఎంత మేలు చేస్తున్నాయో తెలుసుకుంటే   చాలా ఆశ్చర్యం వేస్తుంది .చెట్ల వలన మనం పొందే లాభాలు తెలుసుకోండి మరి .

  •   రెండు పెద్ద చెట్లు రోజుకు నలుగురున్న కుటుంబానికి సరిపడా ప్రాణ వాయువు నిస్తాయి .
  • ఒక పెద్దచెట్టుకు రెండు నుండి నాలుగు  లక్షల ఆకులు ఉంటాయి.ఇవన్నీ కూడా వడబోసే filters లాగా పనిచేస్తాయి.అంటే  గాలిని శుభ్ర పరుస్తాయి.
  • ఒక ఎకరం విస్తీర్ణం లో దట్టంగా   ఉండే చెట్లు ఏటా  13 టన్నుల దుమ్ము,ధూళిలను  తొలగిస్తాయి.
  • చెట్లు లేని రోడ్ల దగ్గర లీటరు గాలిలో 10 నుండి 12 వేల ధూళి కణాలు ఉంటె చెట్లు ఉన్న రోడ్ల దగ్గర కేవలం 3  వేలే ఉంటాయి
  • చెట్టు సహజ మయిన aircondition లాగా పనిచేస్తుంది.ఒక చెట్టు తన ఆకుల ద్వారా రోజుకు  100  gallons నీటిని గాలి  లోకి తేమ రూపంలో వదులుతుంది.అందుకే  చెట్టు నీడ చాలా చల్లగా ఉంటుంది. 
  • ఒక చెట్టు ఇచ్చే చల్లదనాన్ని అయిదు రూం ఎయిర్ కండీషనర్స్ రోజుకు ఇరవై గంటల  వంతున  పని  చేస్తేనే గాని ఇవ్వలేవు.
  • ఒక ఎకరం విస్తీర్ణం లోని చెట్లు ఏడాదికి 2.6 టన్నుల కార్బన్ డై ఆక్సైడ్ ను వాతావరణం నుండి తొలగిస్తాయి.
  • చెట్ల వేళ్ళు భూగర్భ జలాలనుండి  ప్రమాద కరమైన కాలుష్యాలను తొలగించి శుద్ధి చేస్తాయి.
  • ఒక football ground ఆవరణలో ఉండే చెట్లు (సుమారు 400 ) వాహనం ఏడాది పాటు వదిలే కాలుష్యాన్ని వాతావరణం నుండి తొలగించ గలవు.
  • 50 ఏళ్లలో ఒక చెట్టు 37,500 డాలర్ల (సుమారు 1,90,000) విలువైన ఆక్సిజన్ ను ఇస్తుంది. 

ఇంత మేలు చేసే చెట్లను మనం కాపాడుకోవాలి.ప్రభుత్వం చేసిన walta చట్టాన్ని పటిష్టంగా అమలు  చేయాలి.
( ఈ సమాచారం ఈనాడు   పత్రిక నుండి సేకరించినది.వారికి ధన్యవాదాలు) 

Friday 5 October 2012

జీవ వైవిధ్యం దెబ్బతింటే ఏమి జరుగుతుంది? 1



          పంటల వైవిధ్యం దెబ్బ తిన్నది.జొన్న,సజ్జ,రాగి,కొర్ర అంతరిస్తున్నాయి.వీటిల్లో ఉన్న పోషకాలతో పశువులు బ్రతుకుతున్నాయి.వాటి విసర్జితాలు పొలానికి బలమైన ఎరువులు.ఒకప్పుడు రైతు 10,000 రకాల పంటలు పండిం చేవాడు.ప్రస్తుతం  200 లోపే పండింస్తున్నాడు.ఈ గింజలను పక్షులు,జంతువులు అన్నీ తింటాయి.కానీ ఇప్పుడు అన్నీ వాణిజ్య పంటలే!లక్షలు పోసినా పంటకు దిక్కు లేదు.బహుళజాతి విత్తనాలు,రసాయనాలు,క్రిమి సంహార కాలు మట్టిని విషంగా మారుస్తున్నాయి.వాన పాములు,ఎండ్ర కాయలు అంతరిస్తున్నాయి.
         దోమల గుడ్లు కప్పలు తినేవి.కప్పల్ని పాములు తినేవి.పాముల్ని గద్దలు వేటాడేవి.పిచ్చుకలు మిడతలదండు   ను తిని పంటను కాపాడేవి.ఈ చక్రం మనిషి స్వార్ధానికి చిన్నాభిన్నం అవుతుంది.పాములతోలు తో ఫ్యాషన్ వస్త్రాలు  తయారు చేస్తున్నారు.గద్దలకు ఆహారం కరవైంది.ప్రతి 20 నిముషాలకు ఒక జీవ జాతి అంతరించి పోతుంది.
      cell phone towers radiation వలన ఇప్పటికే పిచ్చుకలు అంతరిస్తున్నాయి.కొండలపైకూడా ఏర్పా టు చేయటం తో తేనెటీగలు కూడా నాశనం అవుతున్నాయి.ప్రకృతి కోసం సాంకేతికతను ఉపయోగించాలి పారిశ్రామిక వ్యర్తాల్ని తగ్గించి,కాలుష్యాన్ని నివారించి,చెత్తను సద్వినియోగం చేసుకుంటే ప్రకృతి స్వచ్చంగా మారుతుంది.జీవ వైవిధ్యానికి నష్టం  కలిగించకుండానే ఆర్ధిక ప్రగతి సాధించడానికి చాలా మార్గాలున్నాయి.
       సృష్టిలో మూడు కోట్ల వృక్ష జంతు జాతులున్నాయి.ఇప్పటికి గుర్తించింది15 లక్షలు మాత్రమే!అధిక జనాభాను నియంత్రించుకోవాలి.ఇదే వేగంతో జనాభా పెరిగితే అడవి జంతువులనే కాదు.తోటి మనుషుల్ని పీక్కు తినాల్సి వస్తుం ది.అడవుల్ని,జంతువుల్ని,నదుల్ని,సముద్రాలను,ధ్వంసం చేయటం వలన కాలుష్యం,కరువు కాటకాలు,మాయ రోగాలు,green house effect దాపురిస్తున్నాయి.

Monday 1 October 2012

నేటి నుంచే అంతార్జాతీయ జీవ వైవిధ్య సదస్సు


          అంతార్జాతీయ జీవ వైవిధ్య సదస్సుహైదరాబాద్ లో ఈ రోజు ప్రారంభ మయింది.(Nature protects if she is protected) ప్రకృతిని కాపాడితే అది మనల్ని కాపాడుతుంది అన్నది  ఈ సదస్సు ముఖ్య ఉద్దే శ్యం. సదస్సు పేరు cop-11. 193 దేశాలకు చెందిన ప్రతినిధులు హాజరవుతున్న ఈ సదస్సు హైదరాబాద్ లోని HICCలో october 1 నుండి 19   తేది వరకు జరుగుతుంది.ఈ సందర్భంగా ఈనాడు,సాక్షి, ఆంధ్ర జ్యోతి పత్రికల్లోని సమాచారంలో కొంత భాగాన్ని ఇక్కడ మీకు అందిస్తున్నాను.వారికి ధన్యవాదాలు.
          ఈ సృ ష్టి కొన్ని లక్షల జీవరాశులకు నివాసం.మొదట్లో సృష్టి ఎంతో వైవిధ్యంగా ఉండేది.20 లక్షల సం:క్రితమే మనిషి పుట్టాడు.ప్రకృతిని తన కంటే చాలా బలమైనదిగా అంగీకరిస్తూ దానిని దేవతగా పూజిం చాడు.మొదట్లో ప్రకృ తి గురించి తెలుసుకుంటూ జీవులతో స్నేహం చేస్తూ ఉన్నాడు.జంతువుల మాంసం తినటం ప్రారంబించిన తరు వాత,పంటలు పండించుకునే తెలివివచ్చిన తరువాత అతనికి ధైర్యం వచ్చి ప్రకృ తి నాకోసం పుట్టిందని భావిస్తూ దానిని ఉపయోగించుకుంటూ దోచుకుంటూ,నాశనం చేస్తూ వస్తున్నాడు తాను ఈ సృష్టిలో ప్రత్యేక మని భావిస్తు న్నాడు.కానీ ప్రకృతి దృష్టిలో అందరు సమానమే!.
         వైవిధ్యమే ప్రకృతి లోని రహస్యం.మనుషుల వలన ఎన్నో జీవ జాతులు అంతరించి పోతున్నాయి ఆదిమ దశలో వన్య మృగాల్ని చంపి ఆకలి తీర్చుకున్నాడు.మనిషి నాగరికత నేర్చుకున్న కొద్ది అడవుల్ని నరికేసి గ్రామా ల్ని కట్టుకున్నాడు. జంతువుల తోలు తీసి అమ్ముకోవడానికి బొమ్మల్లాగా అలంకరించుకో వడానికి ఎన్నో అమా యక జీవుల్ని పొట్టన పెట్టుకున్నాడు.ప్రకృతిలో వచ్చేమార్పుల కనుగుణంగా జీవు లు అంతరించి పోవచ్చుకానీ మనిషి స్వార్థం మూలంగా అంతరించి పోకూడదు.గనుల త్రవ్వకాలు,రవాణా మార్గాలు,పారిశ్రామికీకరణ జంతు వులకు అవరోధంగా మారాయి.
         10 సం :క్రితం 10,000 పులులుండేవట ప్రస్తుతం 1500 లోపే ఉన్నాయి.ఎలుగుబంట్లు,ఏనుగులు ఊర్ల మీద దాడి చేస్తున్నాయంటే ఈ అసమ తౌల్యం వల్లనే.వన్యప్రాణులకు అడవి ఒక స్వర్గం.పులులుంటే చెట్లను వేటగాళ్ళు ఏమీ  చేయలేరు .చెట్లు ఎక్కువుంటే వేటగాళ్ళు ఏమీ చేయలేరని అడవి జంతువుల విశ్వాసం.చెట్లు,మృగాలను మని షి ధ్వంసం చేస్తున్నాడు.వాటిని ప్రేమించే గిరిజనులను తరిమి కొడుతు న్నాడు.భూమి వేడెక్కుతుంది అన్నా వరద లు ముంచెత్తినా,భూసారం క్షీనించినా కారణం అడవులు నాశనం కావటం వల్లనే .
        నదులను,సముద్రాలను మనిషి కలుషితం చేస్తున్నాడు.సముద్ర జీవులను వేటాడి ఎగుమతులు చేసి కోట్లు గడిస్తున్నాడు.నక్షత్ర తాబెల్లను,నీటి గుర్రాలను నాశనం చేస్తున్నాడు.అన్ని పారిశ్రామిక వ్యర్థాలను నీటిపాలు చేసి మత్యసంపదను ,అందులోని జీవుల  వినాశనానికి కారణమవుతున్నాడు.